ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో కొనసాగుతున్న లాక్​డౌన్.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి హెచ్చరికలు

By

Published : May 17, 2021, 12:38 PM IST

తెలంగాణలో లాక్​డౌన్ ఆంక్షలు ఆరో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు.

Lock down in Telangana
తెలంగాణలో కొనసాగుతున్న లాక్​డౌన్

తెలంగాణలో లాక్‌డౌన్‌ ఆంక్షలు ఆరో రోజు పకడ్బందీగా అమలవుతున్నాయి. ప్రజలు ఉదయం వేళ నిత్యావసర వస్తువులు కొనేందుకు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉన్నందున మార్కెట్లకు పోటెత్తారు. పలు చోట్ల ప్రజలు కొవిడ్‌ నిబంధనలు మరిచి... భౌతిక దూరం పాటించకుండానే కొనుగోళ్లు సాగించారు.

ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రహదారిపైకి వచ్చిన వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details