కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కోరారు. ఎన్నికలకు సహకరించబోమని కొన్ని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఎస్ఈసీ లేఖలో పేర్కొన్నారు.
సిబ్బందిని కేటాయించండి.. కేంద్రానికి నిమ్మగడ్డ లేఖ - ఏపీ పంచాయతీ ఎన్నికల అప్డేట్స్
ఎన్నికల నిర్వహణకు కేంద్రప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. రాష్ట్రంలో కొన్ని ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణకు సహకరించబోమని అంటున్నాయని లేఖలో పేర్కొన్నారు.
![సిబ్బందిని కేటాయించండి.. కేంద్రానికి నిమ్మగడ్డ లేఖ SEC Nimmagadda letter to Central Home department](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10373611-421-10373611-1611569771737.jpg)
SEC Nimmagadda letter to Central Home department