జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పిటిషన్లపై విచారణను.. ఈనెల 30కి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. జనసేన, భాజపాలతో పాటు తెదేపా నేత వర్ల రామయ్య వేసిన వ్యాజ్యాలు న్యాయస్థానంలో విచారణకు వచ్చాయి. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది కోరారు. దీంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.
పరిషత్ ఎన్నికల పిటిషన్లపై విచారణ 30కి వాయిదా - ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పిటిషన్ విచారణ
పరిషత్ ఎన్నికలపై పిటిషన్లు హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చాయి. ఎస్ఈసీ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయస్థానం విచారణ వాయిదా వేసింది.
ఏపీ హైకోర్టు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై వర్ల రామయ్య పిటిషన్