రాష్ట్రవ్యాప్తంగా ఇసుక టెండర్లు దక్కించుకున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా తవ్వకాలు, విక్రయాలను వచ్చే వారంలో ఆరంభించేందుకు కసరత్తు జరుగుతోంది. తొలుత ఏప్రిల్ 6 నుంచి ఆ సంస్థకు బాధ్యతలు అప్పగించాలని భావించగా, గనులశాఖలోని కీలక అధికారి కరోనా బారినపడటంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ఈ నెల 11 నుంచి గానీ, 16 నుంచి అయినా బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈలోపు గనులశాఖ విధివిధానాలు సిద్ధం చేశాక, గుత్తేదారు సంస్థతో ఒప్పంద ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తూర్పుగోదావరిలో ఓపెన్ రీచ్ల నిలిపివేత