రాష్ట్రంలో ప్రస్తుతం ఆన్లైన్లో ఇసుక బుకింగ్కు అవకాశం కల్పిస్తుండగా.. స్థానికంగా ఉండే నిల్వ కేంద్రానికి వెళ్లి అక్కడికక్కడే (స్పాట్లో) బుక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. ఇసుక కార్పొరేషన్కు విధివిధానాలపై అధ్యయనం చేస్తున్న మంత్రులు, అధికారుల బృందం తాజాగా మరిన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు నిల్వ కేంద్రం, డిపో వద్దకు వెళ్లి నచ్చిన ఇసుకను చూసి అక్కడే బుక్ చేసుకొని తీసుకెళ్లే అవకాశం కల్పించాలని భావించింది. నదులు, వాగులు, వంకలకు సమీపంలో ఉండే గ్రామస్థులు ఎడ్ల బండ్లపై ఉచితంగా ఇసుక తెచ్చుకునే వీలుకల్పించగా, ట్రాక్టర్లలో కూడా ఎటువంటి రుసుము లేకుండా తరలించే వెసులుబాటు కల్పించాలని సూచించింది. అయితే కేవలం ఇళ్లు నిర్మించుకునే సామాన్యులకే ఈ అవకాశం ఇవ్వాలని, గుత్తేదారులు, పెద్ద భవంతులు నిర్మించే బిల్డర్లకు ట్రాక్టర్లో ఉచిత ఇసుక సరఫరా చేయకుండా చూడాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
తెలంగాణ విధానమే మేలు