వైవాహిక బంధం ముగిసిన తర్వాత హీరోయిన్ సమంత తన సినీ కెరీర్పై దృష్టి సారించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన పారితోషికాన్ని సైతం భారీగానే పెంచేసింది.
Samantha: అరుదైన గౌరవం సొంతం చేసుకున్న సమంత - అమరావతి వార్తలు
హీరోయిన్ సమంత అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. గోవాలో జరిగే 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' కార్యక్రమానికి స్పీకర్గా వ్యవహరించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది.

Samantha
ఇదిలా ఉండగా.. తాజాగా సామ్ అరుదైన గౌరవం సొంతం చేసుకుంది. ఈ నెల గోవాలో జరిగే 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' కార్యక్రమానికి స్పీకర్గా వ్యవహరించే అవకాశాన్ని సమంత దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఐఎఫ్ఎఫ్ఐ నిర్వాహకులు సమంతను ఎంపిక చేశారు. దీంతో ఈ వేడుకలో స్పీకర్గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటిగా సమంత గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది.
ఇదీ చూడండి: సూర్య.. బయోపిక్ల బాస్.. నటనకు కేరాఫ్