ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 28, 2022, 8:34 AM IST

ETV Bharat / city

హైకోర్టుకు చేరిన సాయికుమార్​ వైద్య పరీక్ష నివేదిక

పోలీసులు అక్రమంగా నిర్బంధించి, కొట్టారనే ఆరోపణల నేపథ్యంలో వెంకట సత్య సాయికుమార్‌కు వైద్య పరీక్షలు చేయించి నివేదికను హైకోర్టుకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అందజేశారు. ఈ వ్యవహారంపై అఫిడవిట్​ వేయాలని పిటిషనర్​ను ఆదేసించిన హైకోర్టు విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

High Court
హైకోర్టు

కాకినాడ రెండో పట్టణ పోలీసులు అక్రమంగా నిర్బంధించి, కొట్టారనే ఆరోపణల నేపథ్యంలో వెంకట సత్య సాయికుమార్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బుధవారం హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఆ వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. నివేదికను సీల్డ్‌కవర్లో ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అక్రమ నిర్బంధం, పోలీసులు కొట్టిన వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ వేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details