ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేత

By

Published : Apr 9, 2020, 7:45 PM IST

ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. ఈ నెల 15 తర్వాత రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వడంతో చాలామంది ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకున్నారు. లాక్​డౌన్​ పొడిగించే అవకాశం ఉండటంతో అధికారులు ఆన్​లైన్​ రిజర్వేషన్లు నిలిపివేసింది. రిజర్వేషన్లు చేసుకున్న వారికి నగదు వెనక్కి ఇవ్వాలని ఆర్టీసీ భావిస్తోంది.

rtc stopped reservation in ap
rtc stopped reservation in ap

ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బస్సుల రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాకే తిరిగి రిజర్వేషన్లు ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ నెల 15 తర్వాత ప్రయాణాలు చేసేందుకు అనేకమంది రిజర్వేషన్లు చేసుకున్నందున...వారందరికీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో టికెట్ రుసుమును ఆర్టీసీ వెనక్కి ఇచ్చేయనుంది. నగదును ఆన్‌లైన్‌లో ప్రయాణికుల బ్యాంకు ఖాతాకు చెల్లించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details