ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శంషాబాద్ విమానాశ్రయం.. 20 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం - హైదరాబాద్​ క్రైం వార్తలు

హైదరాబాద్​లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీ మెుత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఈ ఘటనలో టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి 20 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.

Drugs seized
మాదకద్రవ్యాలు

By

Published : Jun 21, 2021, 7:41 PM IST

హైదరాబాద్​ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా మాదకద్రవ్యాలు(drugs seized) పట్టుబడ్డాయి. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తి వద్ద డీఆర్‌ఐ అధికారులు మూడు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

టాంజానియా వాసి జాన్‌ విలియమ్స్‌ని ప్రస్తుతం డీఆర్‌ఐ అధికారుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెలలో పెద్దమొత్తంలో అధికారులు డ్రగ్స్​ను స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. ఈ నెల 5న జాంబియాకు చెందిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళల నుంచి రూ.78 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం(drugs seized) చేసుకున్నారు.

ఇదీ చూడండి:ACCIDIENT: రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి

ABOUT THE AUTHOR

...view details