ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

క్రమబద్ధీకరణకు మళ్లీ అవకాశం!

అభ్యంతరం లేని ప్రభుత్వం భూముల్లో నివాసాలకు సంబంధించి ప్రభుత్వం మరో సారి యోచిస్తోంది. ఆ భూముల్ని క్రమబద్ధీకరణ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయబోతోంది.

By

Published : Jul 18, 2021, 9:21 AM IST

government lands
ప్రభుత్వ భూములు

అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్నట్లయితే.. ఆ ఆవాసాన్ని క్రమబద్ధీకరించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అడపాదడపా జరిగే ఈ క్రమబద్ధీకరణను మరోసారి కొనసాగించడంపై ఉన్నత స్థాయిలో పరిశీలన జరుగుతోంది. అధికారిక నిర్ణయం అనంతరం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అధ్యయనం చేయించి తదుపరి చర్యలు చేపడతారు.

ఆర్‌సీసీ కప్పు కలిగిన భవనాలు, ఇళ్లు లేదా ఇటుక గోడలతో ఆస్‌బెస్టాస్‌ పైకప్పు కలిగిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఖాళీ స్థలాలు లేదా గుడిసెలున్న స్థలాలను పరిగణనలోకి తీసుకోరు. ఈ క్రమబద్ధీకరణకు 2019లో ఉన్న నిబంధనలే కొనసాగించాలా? కొత్తగా ఏమైనా జత చేయాలా? అన్నదానిపై సమీక్షిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షల వార్షికాదాయం, పట్టణాలు/నగరాల్లోనైతే రూ.1.44 లక్షల వార్షికాదాయం కలిగి ఇప్పటివరకు ప్రభుత్వ లబ్ధి పొందకుండా ఉన్నవారికి ఈ క్రమబద్ధీకరణలో ప్రాధాన్యమిస్తారు. దరఖాస్తుదారులకు మోటారు వాహనాలు ఉండకూడదు. వ్యవసాయ పనులకు వాహనాలు వినియోగిస్తే మాత్రం మినహాయింపునిస్తారు. వంద చ.అడుగులలోపు ఉంటే నామమాత్ర రుసుం కింద రూపాయి చెల్లిస్తే ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుంది. అంతకంటే ఎక్కువ స్థలమైతే ఫీజులు పెరుగుతాయి

ఇదీ చదవండి:భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్​ సంచులు.. రూపొందించిన డీఆర్డీవో

ABOUT THE AUTHOR

...view details