ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ramoji Foundation: మరో రెండు కార్యక్రమాలకు రామోజీ ఫౌండేషన్​ శ్రీకారం..

Ramoji Foundation: సామాజిక బాధ్యత నిర్వర్తించడంలో ఎల్లప్పుడూ ముందుండే రామోజీ ఫౌండేషన్​.. మరో రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్​మెట్​లో నిర్మించతలపెట్టిన రెవెన్యూ కార్యాలయ భవనాలకు తనవంతు సహకారం అందిస్తోంది.

By

Published : Dec 22, 2021, 7:19 PM IST

Published : Dec 22, 2021, 7:19 PM IST

మరో రెండు కార్యక్రమాలకు రామోజీ ఫౌండేషన్​ శ్రీకారం..
మరో రెండు కార్యక్రమాలకు రామోజీ ఫౌండేషన్​ శ్రీకారం..

మరో రెండు కార్యక్రమాలకు రామోజీ ఫౌండేషన్​ శ్రీకారం..

Ramoji Foundation:సామాజిక బాధ్యతలో భాగంగా రామోజీ ఫౌండేషన్.. మరో రెండు కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్​మెట్​లో.. దాదాపు రూ.3 కోట్ల 85 లక్షలతో రెవెన్యూ కార్యాలయ భవనాల నిర్మాణానికి చేయూతనందిస్తోంది.

రెండుకోట్ల రూపాయలతో ఇబ్రహీంపట్నంలో ఆర్టీవో కార్యాలయ భవన నిర్మాణం చేపడుతోంది. రూ.కోటి 85 లక్షలతో అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ నిర్వహించారు.

ఇబ్రహీంపట్నం ఆర్టీవో కార్యాలయ భూమిపూజ కార్యక్రమంలో రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు. అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ కార్యాలయ భూమి పూజలో యూకేఎంఎల్​ డైరెక్టర్ శివరామకృష్ణ, ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

రోదసిలో టైం మెషీన్- ఖగోళ రహస్యాలను ఛేదించే దర్శిని!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details