ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి తెదేపా నాయకులు, అఖిలపక్ష జేఏసీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. వారికి మద్దతుగా అమరావతిలోని గాంధీ బొమ్మ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించి అమరావతి మద్ధతుగా నినాదాలు చేశారు.
రైతుల దీక్షకు మద్దతుగా అమరావతిలో ర్యాలీ - రాజధానికి మద్దతుగా ర్యాలీ
తెదేపా పిలుపు మేరకు రాజధాని రైతుల దీక్షకు మద్ధతుగా అఖిలపక్ష జేఏసీ, మండల తెదేపా నాయకులు అమరావతిలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.

రైతుల దీక్షకు మద్దతుగా అమరావతిలో ర్యాలీ