ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Raghurama letter to Jagan: సీఎంకు రఘురామ మరోలేఖ.. ఈ సారి 'పెళ్లికానుక'పై..! - mp raghu rama raju on ysr pelli kanuka

వైఎస్​ఆర్ పెళ్లికానుక పథకంపై ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరుతూ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. అధికారంలోకి వస్తే పెళ్లికానుక ఆర్థికసాయం పెంచుతామన్నారని గుర్తు చేశారు.

Raghurama raju third letter to cm jagan
Raghurama raju third letter to cm jagan

By

Published : Jun 12, 2021, 9:30 AM IST

సీఎం జగన్‌కు... ఎంపీ రఘురామకృష్ణరాజు మూడో లేఖ రాశారు. ఈసారి.. వైఎస్‌ఆర్‌ పెళ్లికానుక, షాదీ ముబారక్‌ పథకాలపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే పెళ్లికానుక ఆర్థిక సాయం పెంచుతామన్నారని చెప్పారు.

రూ.లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ హామీకి సైతం ప్రజలనుంచి ఆనాడు మంచి మద్దతు వచ్చిందని రఘురామ.. లేఖలో చెప్పారు. త్వరగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details