ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 24, 2020, 4:48 PM IST

ETV Bharat / city

గాంధీభవన్​లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

పీవీ శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్ లోని గాంధీభవన్​లో ప్రారంభమయ్యాయి. పీవీ నరసింహారావు సోదరుడు పీవీ మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రాంభించారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

pv-centenary
pv-centenary

గాంధీభవన్​లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్​లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఇందిరా భవన్​లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను పీవీ సోదరుడు పీవీ మనోహర్​రావు ప్రారంభించారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్సవాల కమిటీ ఛైర్మన్ గీతా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు పాల్గొని జ్యోతి ప్రజల్వన చేశారు. నరసింహారావు చిత్రపటం వద్ద పలువురు నాయకులు పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. స్వర్గీయ పీవీ నరసింహారావు రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ డాక్యుమెంటరీ ప్రదర్శించారు.

ఇవీ చూడండి:కరోనా చికిత్స కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details