ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వారిని అప్పటివరకు ఉరి తీయమన్నారు' - samatha case news

సమత హత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష పడింది. ఈ కేసులో తుదితీర్పు వెల్లడించిన ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టు... షేక్ బాబు, షేక్ షాబోద్ధీన్, షేక్ మఖ్దూంలను దోషులుగా నిర్ధరిస్తూ... మరణశిక్ష విధించింది. ప్రత్యేక కోర్టులో 50 రోజులు విచారణ కొనసాగినట్లు పీపీ తెలిపారు. నేరం జరిగిన 66 రోజుల్లో దోషులకు శిక్ష ఖరారైందని వెల్లడించారు. ముగ్గురు దోషులకు రూ.26 వేలు జరిమానా విధించినట్లు వివరించారు. చచ్చేంత వరకు నిందితులను ఉరి తీయాలని న్యాయస్థానం చెప్పిందని ఆయన వెల్లడించారు. అప్పీల్​ అనేది వారి హక్కు అని.... వారు కోరితే ప్రభుత్వమే న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందని వివరించారు.

public-prosecution-talk-about-samatha-case
public-prosecution-talk-about-samatha-case

By

Published : Jan 30, 2020, 5:20 PM IST

'చచ్చేంత వరకు ఉరి తీయమన్నారు'

సంబంధిత కథనం:కోర్టు సరైన తీర్పు వెల్లడించింది : సమత భర్త

ABOUT THE AUTHOR

...view details