తెలంగాణ వ్యాప్తంగా వివిధచోట్ల అకాల వర్షం కురిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షం ధాటికి ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం ఐకేపీ కేంద్రంలో పిడుగుపాటుకు గురై... ఓ మహిళ మృతిచెందింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం తడవకుండా రైతులు తీవ్రంగా ప్రయత్నించినా... ఫలితం లేకుండా పోయింది. మద్దిరాల మండలం చిన్ననెమిలలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రెడ్డినాయక్ తండాలో వర్షానికి 20 ఇళ్లు కూలిపోయాయి.
కొట్టుకుపోయిన ధాన్యం
మహబూబ్నగర్ జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. దేవరకద్రలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆరబెట్టుకున్న ధాన్యం... నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణ సముదాయల రేకుల షెడ్లు గాలికి ఎగిరిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఆవంచ, మారేపల్లి, ఇప్పలపల్లి, బుద్ధ సముద్రం, నేరెళ్ల పల్లిలో చేతికొచ్చిన పంట పూర్తిగా తడిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు టార్పాలిన్లు, పాలిథిన్ కవర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. ఉప్పునుంతల మండలం లత్తిపూర్లో పిడుగుపాటుకు మూడు ఆవులు మృత్యువాత పడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
పిడుగులు పడి..