ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 24, 2021, 12:44 PM IST

Updated : Feb 24, 2021, 12:51 PM IST

ETV Bharat / city

ఎన్నికల్లో వాలంటీర్ల ఫోన్ల వినియోగంపై హైకోర్టులో విచారణ వాయిదా

ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల ఫోన్ల వినియోగంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎన్నికల సమయంలో ఫోన్ల వినియోగం చట్టవిరుద్ధమని ఎస్​ఈసీ ఆదేశాలు ఉన్నాయని.. ఎస్​ఈసీ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

postponement of hearing in high court about mobile usage in elections
ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల ఫోన్ల వినియోగంపై హైకోర్టులో విచారణ వాయిదా

ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల ఫోన్ల వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఫోన్ల వినియోగం చట్టవిరుద్ధమని.. ఫోన్ల ద్వారా ఓటర్లపై ఒత్తిడి తెచ్చే అవకాశముందని ఎస్​ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని ఎస్ఈసీ ఆదేశాలు ఉన్నాయని.. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా పడింది.

Last Updated : Feb 24, 2021, 12:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details