ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోడ్డు ప్రమాదంలో పొన్నాల మనవడు మృతి

గచ్చిబౌలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. కాంగ్రెస్​ నేత పొన్నాల లక్ష్మయ్య బంధువు మృతి చెందాడు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

By

Published : Aug 13, 2019, 11:13 AM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ద్రుపథ్

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ద్రుపథ్

హైదరాబాద్‌ గచ్చిబౌలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాంగ్రెస్​ నేత పొన్నాల లక్ష్మయ్య బంధువు కొండూరి ద్రుపథ్​ దుర్మరణం పాలయ్యాడు. పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడైన ద్రుపథ్​ ద్విచక్రవాహనంపై వెళ్తూ డివైడర్​ను ఢీకొనడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పొన్నాల లక్షయ్య ఆస్పత్రికి వెళ్లారు.

వరంగల్​ జిల్లాకు చెందిన 22 ఏళ్ల ద్రుపథ్ గచ్చిబౌలిలోని ఖాజాగూడలో నివాసం ఉంటున్నాడు. మాదాపూర్​లో డిజిటల్​ మార్కెటింగ్​ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలో వేగం నియంత్రించలేక డివైడర్​ను ఢీకొనడం వల్ల మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ​

ఇవీ చూడండి : గోమాతను కాపాడి... ప్రేమను చాటుకున్న పాడి రైతన్న

ABOUT THE AUTHOR

...view details