ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు కేబినెట్ భేటీ... రైతులకు పోలీసుల నోటీసులు

రేపు మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే దారిలోని ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం, మంత్రులు వెళ్లే మార్గంలో ఆందోళనలకు అనుమతి నిరాకరించినట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

By

Published : Dec 25, 2019, 6:53 PM IST

Updated : Dec 26, 2019, 6:29 AM IST

police notice to capital farmer due to cabinet meet
కేబినేట్ భేటీ దృష్ట్యా... రైతులకు పోలీసుల నోటీసులు

మీడియాతో మాట్లాడుతున్న తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

రేపు అమరావతిలో జరిగే మంత్రిమండలి భేటీ సందర్భంగా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. మందడం నుంచి సచివాలయానికి వెళ్లే రహదారి పక్కనున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. కొత్త వ్యక్తులు వస్తే తమకు చెప్పాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మంత్రిమండలి భేటీ జరిగే రోజున నిరసనలకు అనుమతి నిరాకరించారు.

రేపు రైతుల ఇళ్లలో కొత్త వ్యక్తులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా ఉంటే తమకు తెలియచేయాలన్నారు. మంత్రిమండలి నేపథ్యంలో రైతులకు నోటీసులు ఇచ్చామని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీఎం, మంత్రులు వెళ్లే మార్గంలో నిరసనలకు అనుమతి లేదన్న డీఎస్పీ... మంత్రిమండలి భేటీ సచివాలయంలోనే జరిగే అవకాశం ఉందన్నారు.

Last Updated : Dec 26, 2019, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details