సినీ నిర్మాత, వైకాపా నేత ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ)పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల పీవీపీపై నమోదైన ఒక కేసు విచారణకు సంబంధించి పలువురు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగుతున్న పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. విచారణకు వెళ్తే తమపై కుక్కలను ఉసిగొల్పారని ఎస్సై హరీశ్రెడ్డి ఫిర్యాదు చేయగా, ఐపీసీ 353కింద పీవీపీపై కేసు ఫైల్ చేశారు.
తెలంగాణ: పోలీసులపై కుక్కలను వదిలిన వైకాపా నేత పీవీపీ - potuluri vara prasad news
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సినీనిర్మాత, వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ)పై మరో కేసు నమోదయింది. కేసు దర్యాప్తులో భాగంగా.. ఇంటికి వెళ్తే తమపైకి కుక్కలను వదిలారంటూ.. బంజారాహిల్స్ ఎస్సై హరీశ్ ఫిర్యాదు చేశారు.

సినీనిర్మాత, వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్
గతవారం పీవీపీపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ సదరు వ్యక్తి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్లోని రోడ్ నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లగా, ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇవీ చూడండి: పీపీఈ కిట్ల ఎగుమతికి కేంద్రం ఓకే
Last Updated : Jun 29, 2020, 7:51 PM IST