ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 10, 2020, 11:17 AM IST

ETV Bharat / city

తుళ్లూరులో ఉద్రిక్తత: పోలీసుల లాఠీఛార్జి

తుళ్లూరులో పోలీసుల తీరు ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు, మహిళలు.. అమ్మవారికి పొంగళ్లు పెట్టేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ప్రజలు ముందుకు వెళ్లకుండా ఇనుప కంచెలు అడ్డుపెట్టారు. మహిళలు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అమ్మవారికి పొంగళ్లు పెట్టేందుకు తరలివెళ్లారు. ఈ పరిస్థితుల్లో కొందరు మహిళలకు గాయాలయ్యాయి.

police-baton-charge-in-tulluru
police-baton-charge-in-tulluru

తుళ్లూరులో ఉద్రిక్తత: పోలీసుల లాఠీఛార్జి

.

ABOUT THE AUTHOR

...view details