ఒకసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులను వచ్చే ఏడాది నాటికి నిషేధించాలని లక్ష్యంగా నిర్ణయించామని.. ఆ దిశగా అన్ని రాష్ట్రాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతి అంశాలపై ఆయన దిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.
నిత్యం వాడే ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్నబాటిళ్లు, స్ట్రా, సాచెట్లు తదితర ప్లాస్టిక్ వస్తువులు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని.. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు అన్నీచోట్ల దశల వారీగా ప్లాస్టిక్పై నిషేధం అమలు చేస్తామని ప్రధాని చెప్పారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణకు రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్, రికవర్, రీడిజైన్, రీమాన్యు ఫ్యాక్చరింగ్ అనే 6ఆర్ విధానాన్ని అనుసరించాలని సూచించారు.
అవగాహన కల్పించండి...