రాష్ట్రంలోని పాఠశాలలు పునః ప్రారంభించడానికి, పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ముందు ఉపాధ్యాయులందరికీ కొవిడ్ టీకాలు వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హై కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు వై.ఉమాశంకర్ పిటిషన్ దాఖలు చేశారు.
'ఆ నిర్ణయం చట్ట విరుద్ధమని ప్రకటించండి'
ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ఇవ్వకుండా జూన్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభించడానికి, జూన్ 7న పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని చట్ట విరుద్ధమైందిగా ప్రకటించాలని కోరారు.