ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ప్రశాంతంగా మేడే వేడుకలు

లాక్​డౌన్ నిబంధనతో రాష్ట్రంలో కార్మిక దినోత్సవ వేడుకలు కళ తప్పాయి. ఆటపాటలు, డప్పుచప్పుళ్లు, నృత్యాలతో అట్టహాసంగా జరగే సంబరాలు ఈ సారి ప్రశాంతంగా జరిగాయి. లాక్​డౌన్​తో పరిమిత సంఖ్యలో నాయకులు హాజరై, భౌతిక దూరం పాటిస్తూ ఎర్రజెండాను ఆవిష్కరించారు.

By

Published : May 1, 2020, 6:39 PM IST

peacefull mayday celebrations in andhrapradhesh
రాష్ట్రంలో ప్రశాంతంగా మేడే వేడుకలు

కార్మికుల శ్రమ దేశానికి సంపద అని ఉప ముఖ్యమంత్రి అంజాద్​బాషా అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప రిమ్స్ లో పనిచేస్తున్న 600 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఉపముఖ్యమంత్రి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు జిల్లా యంత్రాంగం ఎంతగానో కృషి చేస్తోందని కొనియాడారు. రైల్వేకోడూరు. ఓబులవారిపల్లె మండలాల్లో మేడే ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయి. పరిమిత సంఖ్యలో నాయకులు హాజరై, భౌతిక దూరం పాటిస్తూ జెండా ఆవిష్కరించారు.

విశాఖపట్నం జిల్లాలో

ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం పది వేల రూపాయలు అందించాలని సీ.పీ.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని నీలం రాజశేఖర్​రెడ్డి భవనంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం ఎర్రజెండాను ఎగురవేశారు. అనకాపల్లిలో మేడే వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలోని సీపీఐ కార్యాలయం, ఆర్టీసీ డిపో వద్ద నాయకులు జెండా ఆవిష్కరించారు.

అనంతపురం జిల్లా పెనుకొండలో ...

పెనుకొండ నగరపంచాయతీ కార్యాలయం ఎదుట సీపీఎం నేతలు జెండా ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడి చనిపోయిన అమరులకు నివాళులు అర్పించారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ...

నరసన్నపేటలో జట్టు కళాసీ యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు జరిగాయి. యూనియన్ గౌరవ అధ్యక్షులు విశ్వేశ్వరరావు , కింజరాపు ముసలి నాయుడు పతాకావిష్కరణ చేశారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో ....

చిత్తూరు జిల్లా పుంగనూరులో పురపాలక శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఈ కార్యక్రమానికి హాజరై పతాకాన్ని ఆవిష్కరించారు. అత్యవసర సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆయన సన్మానించారు.

ఇదీచదవండి.

కుటుంబానికి దూరమైన తల్లి... 40 రోజులు అక్కడే..!

ABOUT THE AUTHOR

...view details