ఈ నెల 22, 23న ప్రకాశం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. 22న ఒంగోలులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ను కలవనున్నారు. పార్టీ కార్యకర్త వెంగయ్య ఆత్మహత్య ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అనంతరం వెంగయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు.
ఈనెల 22న ప్రకాశం జిల్లాకు పవన్ కల్యాణ్ - ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్త ఆత్మహత్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈనెల 22,23వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తానని ఓ ప్రకటనలో వెల్లడించారు.
![ఈనెల 22న ప్రకాశం జిల్లాకు పవన్ కల్యాణ్ pawan kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10311062-14-10311062-1611135879900.jpg)
pawan kalyan to visit prakasam