దిల్లీకి పవన్.. నేడు ప్రముఖులను కలిసే అవకాశం - దిల్లీ పర్యటనలో పవన్ కల్యాణ్
జనసేనాని పవన్.. దిల్లీ చేరారు. పార్టీ కీలక నేత నాదెండ్ల తోడుగా.. హస్తిన చేరుకున్నారు.
![దిల్లీకి పవన్.. నేడు ప్రముఖులను కలిసే అవకాశం pawan kalyan reached delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5678593-763-5678593-1578755634638.jpg)
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిల్లీ వెళ్లారు. అయన వెంట పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. నేడు ప్రముఖులతో జనసేనాని భేటీ అయ్యే అవకాశం ఉంది. దిల్లీ పెద్దలతో అమరావతి సహా.. ఇతర అంశాలపై పవన్ చర్చిస్తారని సమాచారం. అంతకు ముందు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ అమరావతి వ్యవహారంపై శ్రేణులతో జనసేనాని విస్తృతంగా చర్చించారు. త్వరలో అమరావతిలో కవాతు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇంతలో.. దిల్లీకి వెళ్లిన పవన్.. రాష్ట్రంలో రగులుతున్న సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.