ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 21, 2019, 5:06 PM IST

ETV Bharat / city

'రాజధానిపై గందరగోళం శ్రేయస్కరం కాదు' ​

రాజధానిపై గందరగోళ పరిస్థితి శ్రేయస్కరం కాదని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ అన్నారు. జీఎన్​ రావు కమిటీ నివేదికపై రాష్ట్ర మంత్రి వర్గ చర్చ అనంతరం తమ నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామని జనసేనాని స్పష్టం చేశారు.

'రాజధానిపై గందరగోళం శ్రేయస్కరం కాదు' ​
'రాజధానిపై గందరగోళం శ్రేయస్కరం కాదు' ​

మంత్రి వర్గ భేటీ అనంతరం తమ నిర్ణయం ప్రకటిస్తామన్న జనసేనాని

రాజధాని విషయమై ప్రజల్లో గందరగోళం నెలకొందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ పరిస్థితి సర్వత్రా శ్రేయస్కరం కాదని పవన్​ అభిప్రాయపడ్డారు. కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చిస్తామంటున్నారని... ఆ తర్వాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామని జనసేనాని తెలిపారు. అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలో...? 4 భవనాలో..? అని భావించట్లేదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రాజకీయ జవాబుదారీతనం కోరుకుంటున్నామని పవన్​ తెలిపారు

ABOUT THE AUTHOR

...view details