ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్​ఈసీ తొలగింపు.. ప్రభుత్వ కక్ష సాధింపే: పవన్​ - జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ వార్తలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ ప్రభుత్వం​ జారీ చేసిన ఉత్తర్వులపై జనసేన అధినేత పవన్​కల్యాణ్​ మండిపడ్డారు. కరోనా కాలంలో ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టాలే కానీ మొండి వైఖరిని ప్రదర్శించి.. కక్ష తీర్చుకోకూడదన్నారు.

pawan kalyan fire on cm jagan for Issued GO on (sec) state election commissioner
pawan kalyan fire on cm jagan for Issued GO on (sec) state election commissioner

By

Published : Apr 10, 2020, 8:35 PM IST

ఎస్​ఈసీపై జగన్​ది కక్ష సాధింపు చర్యలే : పవన్​

జగన్‌ ప్రభుత్వం మరోసారి కక్షసాధింపు, మొండి వైఖరితో వ్యవహరించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఎస్​ఈసీని తొలగిస్తూ జారీచేసిన ఉత్తర్వుల ద్వారా తన వైఖరిలో మార్పు లేదని సీఎం నిరూపించుకున్నారన్నారు. ముఖ్య విషయాల్లో జగన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగానే ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషనర్‌ను తొలగించడానికి అసలు ఇది సమయమా అని పవన్‌ ప్రశ్నించారు.

ప్రజలను కాపాడడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం... కక్ష తీర్చుకునే కార్యక్రమంలో మునిగిపోయిందని విమర్శించారు. కరోనా సమయాన ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడే సమయం ఇదని.. ప్రభుత్వ కార్యాచరణ ఆ దిశగా ఉండాలని జనసేన కోరుకుంటున్నట్లు ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details