హైదరాబాద్ దోమలగూడలోని జ్యోతినగర్లో తోపుడు బండి మీద ఓ మహిళ ఉల్లిపాయలు విక్రయిస్తుంటుంది. రోజూలానే రాత్రి కాగానే బండి మూసేసి.. ఫుట్పాత్ పక్కన పెట్టి ఇంటికి వెళ్లిపోయింది. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి.. అర్ధరాత్రి సమయంలో అక్కడికి వచ్చి 20 కిలోలకు పైగా ఉల్లిపాయలను సంచిలో వేసుకొని వెళ్లాడు.
భాగ్యనగరంలో 'ఉల్లి' చోరీ... దొంగను పట్టించిన సీసీటీవీ - హైదరాబాద్లో 20 కిలోల ఉల్లిగడ్డల చోరీ
ఇప్పటి వరకు బంగారం, వెండి ఆభరణాలు దొంగతనం చేయడం చూశాం. మద్యం దొంగిలించడం గురించి విన్నాం.. అయితే ఉల్లిపాయలు చోరీకి గురవ్వడం విచిత్రంగా ఉంది కదూ..! ఈ సంఘటన హైదరాబాద్లో జరిగింది.
![భాగ్యనగరంలో 'ఉల్లి' చోరీ... దొంగను పట్టించిన సీసీటీవీ onions-got-theft-at-domalaguda-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5369835-641-5369835-1576307969809.jpg)
భాగ్యనగరంలో 'ఉల్లి' దొంగ
తెల్లవారుజామున ఉల్లి విక్రయించే మహిళ వచ్చి చూసేసరికి తన బండిలో ఉల్లి తక్కువగా ఉండటం గమనించింది. ఎవరో దొంగతనం చేశారని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించారు.
భాగ్యనగరంలో ఉల్లికీ భద్రత లేకుండా పోయిందనీ.. ఇకపై ఉల్లిపాయలకూ భద్రత కల్పించాల్సిన అవసరముందని బండి యజమాని ఈశ్వరీబాయి అభిప్రాయపడ్డారు.
భాగ్యనగరంలో 'ఉల్లి' దొంగ
- ఇదీ చదవండి ..చదివింది ఐటీఐ... ఆవిష్కరణల్లో మేటియై..!