ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఆటో బీభత్సం.. సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు - గాజులరామారంలో జరిగిన ప్రమాదంలో ఒకరికి గాయాలు

తెలంగాణలోని మేడ్చల్​ జిల్లా జగద్గిరిగుట్టలోని గాజులరామారంలో ఓ ఆటో భీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుస్తూ వెళుతున్న నలుగురు యువకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఆటో బీభత్సం... సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు నిక్షిప్తం
ఆటో బీభత్సం... సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు నిక్షిప్తం

By

Published : Apr 17, 2021, 7:47 PM IST

ఆటో బీభత్సం... సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు నిక్షిప్తం

అతివేగంతో వచ్చిన ఆటో నలుగురు యువకులపైకి దూసుకెళ్లగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధి గాజులరామారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.

ప్రమాదం జరిగిందిలా..

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు యువకులపైకి ఆటో ఒక్కసారిగా దూసుకొచ్చింది. జగద్గిరిగుట్ట పరిధిలోని గాజులరామారంలో ఓ మలుపు వద్ద డ్రైవర్ మస్తాన్ అతి వేగంతో రాగా.. అదుపుతప్పిన ఆటో బోల్తా పడి నలుగురు యువకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో గణేశ్​ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:బైక్​లో పెట్టిన 9 లక్షలు​ మాయం.. అసలేమైంది..?

ABOUT THE AUTHOR

...view details