ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈఎస్​ఐ స్కాం: మరొకరిని అరెస్టు చేసిన అనిశా.. 16 వరకు కస్టడీ

By

Published : Jul 3, 2020, 10:30 PM IST

ఈఎస్​ఐ మందుల కుంభకోణంలో తెలుగుపల్లి కార్తిక్ అనే వ్యక్తిని అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా ఈనెల 16 వరకు కస్టడీ విధించింది.

ap esi scam
ap esi scam

ఈఎస్‌ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా.. తెలుగుపల్లి కార్తిక్‌ అనే వ్యక్తిని అనిశా అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు బిల్లులు, కొటేషన్లతో ఈఎస్‌ఐ ఔషధాలు కొనుగోలు చేశారని కార్తిక్​పై ఆరోపణలు ఉన్నాయి.

విజయవాడ భవానీపురంలోని ఔషధ దుకాణం నుంచి ఔషధాలు కొని బిల్లులు సృష్టించినట్లు... వివిధ కంపెనీల పేరుతో కొనుగోలు జరిపినట్లు అనిశా దర్యాప్తులో బయటపడింది. అరెస్టు అనంతరం కార్తిక్‌ను అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 16 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ABOUT THE AUTHOR

...view details