Officials ignore the growing caesarean: రాష్ట్రంలో సిజేరియన్లు ఎక్కువవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య రాష్ట్రవ్యాప్తంగా 2,32,436 ప్రసవాలు జరిగితే అందులో 45% సిజేరియన్లు కావడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. ఇందులో 36% ప్రభుత్వాసుపత్రుల్లో, మిగిలిన 54% ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. పట్టణ/ నగర/ గ్రామీణ మహిళలు నొప్పులు భరించేందుకు వెనుకంజ వేస్తుంటే.. కొండాకోనల్లో నివసించే గిరిజన మహిళలు మాత్రం ఎంత నొప్పి అయినా సరే సహజ ప్రసవాలకే సిద్ధమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భం దాల్చినప్పటి నుంచి ఆశా, ఏఎన్ఎంల ద్వారా సేవలు పొందిన గర్భిణుల్లో ఎక్కువ మందికి సిజేరియన్లు తప్పడం లేదు. సకాలంలో ప్రసవాలు జరగనందున కొన్నిచోట్ల తల్లీబిడ్డలకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తి సిజేరియన్లు తప్పనిసరవుతున్నాయి.
గర్భిణులు నొప్పులు భరించలేమని చెబుతుండటం, కుటుంబసభ్యుల ఒత్తిడి వల్ల వైద్యులు కూడా వేచి చూడకుండా సిజేరియన్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో సహజ కాన్పులు పెంచేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రయత్నిస్తున్నా.. అక్కడ తగిన వసతులు లేకపోవడం, వైద్య సిబ్బంది ‘రిస్క్’ తీసుకునేందుకు సిద్ధంగా లేనందున సిజేరియన్లు పెరుగుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు విశ్లేషించారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం డబ్బు కోసమే కాన్పుకోతలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
గిరిజనులు నొప్పులు భరిస్తారు