రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫించన్దారులకు జూన్ నెల జీతాలు, పింఛన్లు ఇంకా అందలేదు. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లభించకపోవటంతో కొంత ఆలస్యమైంది. తాజాగా 14రోజుల గడువు దాటి బిల్లు ఆమోదం పొందిన తర్యాత కూడా ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో ఉద్యోగులు, పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు.
సోమవారం జీతాలు అందుతాయని ఆశించినా ఖాతాల్లో ఇంకా సొమ్ములు జమ కాకపోవటంతో సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. గురువారం రాత్రికే బడ్జెట్కు గవర్నర్ ఆమోదముద్ర పడి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇతరత్రా కార్యకలాపాలు పూర్తి చేసుకుని సోమవారం నాటికి జీతాలు అందిస్తారని ఉద్యోగులు ఎదురుచూశారు. సోమవారం మధ్యాహ్నానికి జీతాలు, పింఛన్ల బిల్లులు రిజర్వు బ్యాంకు ఈ-కుబేర్ చేరలేదు. ఆయా శాఖల బడ్జెట్ను సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
సాంకేతిక కారణాల వల్లే ఆలస్యం