ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కేసీఆర్‌కు కొవిడ్ లక్షణాలు తగ్గిపోయాయి: డాక్టర్ ఎంవీ రావు

By

Published : Apr 22, 2021, 8:25 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కొవిడ్ లక్షణాలు తగ్గిపోయాయని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎం.వి.రావు ప్రకటించారు. ఊపిరితిత్తులకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ రాలేదన్న ఎంపీ రావు.. ఆక్సిజన్‌ స్థాయి బాగానే ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉందని వివరించారు.

ts cm kcr
సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా లక్షణాలు తగ్గిపోయి... పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు వెల్లడించారు. కేసీఆర్​కు సాధారణ వైద్యపరీక్షలు నిర్వహించడం సహా సిటీ స్కానింగ్‌ చేశామని... అంతా సాధారణంగానే ఉందని వివరించారు. ఊపిరితిత్తులకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ రాలేదన్న ఎంపీ రావు.. ఆక్సిజన్‌ స్థాయి బాగానే ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉందని వివరించారు.

వైద్యుల సూచన మేరకు ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌ వచ్చిన కేసీఆర్‌కు... సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో సిటీ స్కానింగ్‌ సహా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షల నిమిత్తం నమానాలు సేకరించిన వైద్యులు... అవి ఇవాళ వస్తాయని తెలిపారు. అనంతరం కేసీఆర్​ వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.మూడురోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా నిర్ధరణ కావడంతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details