ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇళ్ల స్థలాలు పంచుతున్నారా..? అమ్ముతున్నారా..?' - వైసీపీపై నిమ్మల రామానాయుడు లెటెస్ట్ కామెంట్స్

ఇళ్ల స్థలాల పంపిణీ పేరిట వైకాపా నేతలు భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని తెదేపా నేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. భూసేకరణ పేరిట కోట్ల రూపాయలు దండుకుంటున్నారని విమర్శించారు. కోట్లు విలువైన ప్రభుత్వ భూములను బిల్డ్​ ఏపీ పేరిట అమ్మేస్తూ... పేదల భూములు లాక్కుంటున్నారని ఆక్షేపించారు. వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారా... మామూళ్లు తీసుకుని అమ్ముతున్నారా అని ప్రశ్నించారు.

తెదేపా నేత నిమ్మల రామానాయుడు
తెదేపా నేత నిమ్మల రామానాయుడు

By

Published : Jun 7, 2020, 3:11 PM IST

ఇళ్ల స్థలాల ముసుగులో వైకాపా నేతలు భూముల దోపిడీకి పాల్పడుతున్నారని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. భూసేకరణను ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.5 లక్షల చొప్పున దండుకుంటున్నారని విమర్శించారు. లబ్ధిదారుల నుంచి వేల రూపాయలు మామూళ్లు వసూలు చేశారని మండిపడ్డారు.

సీఎం జగన్ పేదలకు భూములు పంచుతున్నారా లేక అమ్ముతున్నారా అని రామానాయుడు ప్రశ్నించారు. ఏడాదిలో 8 నెలలు నీటిలో ఉండే ఆవ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడం కుంభకోణమేనని అన్నారు. ఆవ భూముల్లోనే 400 కోట్ల రూపాయలు జే - టాక్స్ రూపేణా దోచుకుంటున్నారని.. వాటాల్లో తేడాలు వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీలకు వైవీ సుబ్బారెడ్డి రాజీ చేస్తున్నారని ఆరోపించారు.

జగన్ అనుచరులకు భూములు కట్టబెట్టేందుకే బిల్డ్ ఏపీ చేపట్టారని రామానాయుడు విమర్శించారు. విశాఖలో విలువైన ప్రభుత్వ భూములు అమ్మేస్తూ... పేదల నుంచి భూముల సేకరణ చేయడమేంటని ప్రశ్నించారు. ఇసుకను బ్లాక్ మార్కెట్​లో అమ్ముకుంటున్నారని ఆక్షేపించారు.

ఇదీ చదవండి..

లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం

ABOUT THE AUTHOR

...view details