ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదు.. 14మంది మృతి

By

Published : Aug 8, 2020, 10:13 AM IST

తెలంగాణలో కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. 23 వేల 322 మందికి పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2 వేల 256 మందికి వైరస్‌ సోకినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో బాధితుల సంఖ్య 77 వేల 513కి చేరినట్లు వివరిచింది. తెలంగాణలో కొవిడ్‌ బారిన పడి మరో 14 మంది మరణించగా... మెుత్తం మృతుల సంఖ్య 615కి చేరింది.

tg corona cases
tg corona cases

జీహెచ్​ఎంసీ పరిధిలో 464 మందికి, రంగారెడ్డి 181, మేడ్చల్‌ 138, వరంగల్‌ అర్బన్‌ 187, కరీంనగర్‌ 101, జోగులాంబ గద్వాల 95, పెద్దపల్లి 84, సంగారెడ్డి 92, భద్రాద్రి 79మందికి వైరస్‌ నిర్ధరణ అయింది. వైరస్‌ నుంచి మరో 1,091 మంది బాధితులు కోలుకోగా.. మెుత్తం కోలుకున్న వారి సంఖ్య 54 వేల 330కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కోంది. ప్రస్తుతం 22 వేల 568 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 5లక్షల 90 వేల 306 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదు.. 14మంది మృతి

ABOUT THE AUTHOR

...view details