గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 30 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8,88,899కి చేరిందని వెల్లడించింది. తాజాగా.. కరోనా కారణంగా ఒకరు మృతి చెందగా... మహమ్మారి ప్రభావంతో ఇప్పటివరకు 7,163 మంది మృతి చెందినట్లు వివరించింది.
మరోవైపు.. గడిచిన 24 గంటల్లో 69 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 8.8 లక్షలకు పైగా చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 35 లక్షలు దాటినట్లు తాజా బులెటిన్ లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.