ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 479 కరోనా కేసులు, 4 మరణాలు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62,215 కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 479 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,355 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

By

Published : Dec 19, 2020, 5:30 PM IST

new corona cases in andhrapradhesh
రాష్ట్రంలో కొత్తగా 479 కరోనా కేసులు, 4 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 479 కరోనా కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,78,285కు చేరింది. వైరస్ మృతుల సంఖ్య 7,074 కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న మరో 497 మంది కోలుకోగా... ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.66 లక్షలుగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,355 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 62,215 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్రవైద్యారోగ్య శాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details