ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు.. 5 మరణాలు

By

Published : Dec 7, 2020, 5:54 PM IST

రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,72,288కు చేరింది. తాజాగా మరో ఐదుగురు మృతి చెందినట్లు వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్​లో పేర్కొంది.

ap Corona bulletin
రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 43,006 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 316 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ బారిన పడి ఐదుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,72,288కు చేరింది. గడిచిన 24 గంటల్లో 595 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8.59 లక్షల మంది ఇళ్లకు వెళ్లిపోయారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం 7,038 మంది కొవిడ్‌తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,626 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,04,53,618 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details