సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో ఏపీని ముక్కలు చేయాలని చూస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. 3 ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 200 రోజులుగా అన్నదాతలు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఇది విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటమని ఉద్ఘాటించారు. 'ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని' అంటూ అమరావతి కోసం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.
కక్షసాధింపు కోసం అధికార దుర్వినియోగం