ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బోటు ప్రమాదం వెనక రహస్యాలను దాచలేరు: లోకేశ్​ - cops registerd case on ex mp harsha kumar

గోదావరి బోటు ప్రమాదంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నారా లోకేశ్​ తప్పుబట్టారు. ప్రమాదం వెనక ఉన్న రహస్యాలను జల సమాధి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ హర్షకుమార్​ని కేసుల పేరుతో వేధించటం సరికాదని అన్నారు.

nara-lokesh-cooments-on-boat-accident

By

Published : Oct 6, 2019, 5:04 PM IST

Updated : Oct 6, 2019, 9:19 PM IST


గోదావరి బోటు ప్రమాదం వెనక ఉన్న నిజాలు బయటపెట్టిన మాజీ ఎంపీ, దళిత నాయకుడు హర్ష కుమార్​ను కేసుల పేరుతో వేధిస్తారా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ నిలదీశారు. గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి జగన్ అని ఎద్దేవా చేశారు. నదిలో నుంచి బోటును తీయకపోవటం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనంఅనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని ప్రశ్నించారు. బోటు ప్రమాదం వెనక ఉన్న రహస్యాన్ని జల సమాధి చేయాలని చూస్తే నిజాలు దాగవని హెచ్చరించారు. ఘటనపై సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

బోటు ప్రమాదం వెనక ఉన్న రహస్యాలను దాచలేరు:లోకేష్
Last Updated : Oct 6, 2019, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details