ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నాడు-నేడు' కింద బడుల అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ - ఏపీ పాఠశాలల్లో నాడు నేడు పనులు

నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11,826 పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి సరఫరా యూనిట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. మొత్తం రూ. 781 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిధులు మొత్తం నాబార్డు అందించనుంది.

nadu nedu works in ap schools
'నాడు-నేడు' కింద పాఠశాలల అభివృద్ధి కోసం పరిపాలన అనుమతులు జారీ

By

Published : Aug 28, 2020, 4:51 PM IST

నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 11,826 పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి సరఫరా యూనిట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. మొత్తం రూ. 781 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. 664 మండలాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి సరఫరా యూనిట్ల నిర్మాణం కోసం నాబార్డు సహకారం అందించనుంది. గ్రామీణ మౌలిక సదుపాయల అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఈ నిధులు మొత్తం నాబార్డు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 137 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details