పీకలదాకా మద్యం సేవించి టాటా ఏసీ ట్రాలీలో వెళ్తూ బీరు సీసాను రోడ్డుపై విసిరేసిన ఆకతాయిలకు.. తనదైన శైలిలో ఓ సర్పంచ్ గుణపాఠం నేర్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కొర్లకుంటలో.. మేడారం ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ వాహనంలో నుంచి బీరు సీసా బయటకు విసిరేశారు. కొర్లకుంట సర్పంచ్ ముక్కెర నవీన్ కుమార్.. ఈ విషయాన్ని గమనించారు.
తెలంగాణ: ఆకతాయిలకు బుద్ధి చెప్పిన సర్పంచ్ - తెలంగాణలోని ముక్కెర సర్పంచ్ నవీన్ కుమార్ వార్తలు భూపాలపల్లి జిల్లా
నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆకతాయిలకు తెలంగాణకు చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముక్కెర సర్పంచ్ గుణపాఠం నేర్పారు. పూటుగా తాగి.. వెళ్తున్న వాహనంలో నుంచి బీరు సీసాను రోడ్డుపైకి విసిరేశారు ఆకతాయిలు. ఆ సర్పంచ్ వారిని వెంబడించి మరీ సీసా విసిరిన ప్రాంతానికి తీసుకెళ్లి.. చీపురుతో ఊడ్పించారు.
ఊడుస్తున్న ఆకతాయిలు
తన వాహనంతో ఆకతాయిలు వెళ్తున్న ట్రాలీని సర్పంచ్ వెంబండిచారు. బీరు సీసా విసిరిన ప్రాంతానికి వారిని తీసుకువచ్చి.. చీపురుతో ఊడ్పించారు. సీసా ముక్కలు ఎత్తించి రహదారికి దూరంగా వేయించారు. మరోసారి ఇలా ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చేయవద్దని బుద్ధి చెప్పారు.