ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రెండు నిమిషాలు ఆగండి'.. మహారాష్ట్ర ఎంపీ తెలుగు పలుకులు

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ లోక్​సభ​లో తెలుగులో ప్రసంగించి ఆశ్చర్యపర్చారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆమెకు అడ్డుతగిలిన తెలుగు ఎంపీలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By

Published : Aug 6, 2019, 6:14 PM IST

'రెండు నిమిషాలు ఆగండి'.. మహారాష్ట్ర ఎంపీ తెలుగు పలుకులు


జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా లోక్​సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ విపక్ష​ సభ్యులకు ఝలక్ ఇచ్చారు. పున్వరిభజన బిల్లుపై కౌర్ మాట్లాడుతుండగా కొందరు తెలుగు ఎంపీలు అడ్డుతగిలారు. వెంటనే కౌర్ స్పందించి... 'రెండు నిమిషాలు ఆగండి, నేనూ స్వతంత్రంగా గెలిచాను, విపక్ష సభ్యురాలిని కానీ బిల్లుకు మద్దతిస్తున్నాను' అంటూ తెలుగులో కౌంటర్ ఇస్తూ... ప్రసంగాన్ని పూర్తి చేశారు.

లోక్ సభలో మాట్లాడుతున్న ఎంపీ నవనీత్ కౌర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details