ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 13, 2020, 9:16 PM IST

ETV Bharat / city

సజ్జల గారూ... ముందు జగన్​కు అ, ఆ లు నేర్పించండి: దీపక్​రెడ్డి

లోకేశ్​ గురించి సజ్జల రామకృష్ణరెడ్డి మాట్లాడేముందు సీఎం జగన్​తో మీడియా సమావేశం నిర్వహించాలని తెదేపా నేత దీపక్​ రెడ్డి డిమాండ్ చేశారు. వంద మంది జర్నలిస్టులతో సమావేశం నిర్వహించి ప్రశ్నలకు జవాబులు చెప్పే సత్తా లోకేశ్​కు ఉందని అన్నారు. లోకేశ్​ గురించి సజ్జల మాట్లాడే ముందు జగన్​కు అ, ఆ లు నేర్పించాలని సూచించారు.

mlc deepak reddy fiers on sajjala
mlc deepak reddy fiers on sajjala

వైకాపా నేత సజ్జల రామకృష్ణరెడ్డిపై తెదేపా ఎమ్మెల్సీ దీపక్​ రెడ్డి మండిపడ్డారు. సహజ వాయువుపై పెంచిన పన్ను భారం ఎవరి మీద పడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 10 శాతం పెంచిన వ్యాట్​ను ఇడుపులపాయ నేలమాళిగల నుంచి తీసి కడతారా అని ప్రశ్నించారు. పెంచిన వ్యాట్ వల్ల వంట గ్యాస్ వినియోగదారులపై భారం పడదా అని నిలదీశారు. కొన్ని జిల్లాల్లో పైప్డ్ గ్యాస్​ని వంట గ్యాస్​గా వినియోగిస్తున్న సంగతి సజ్జలకు తెలీదా అని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం పెంచిన భారం ప్రజలపై పడదంటున్నారు మరి, ఎవరి మీద పడుతుందో చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు.

లోకేశ్​పై సజ్జల అనవసరపు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్​ గురించి మాట్లాడే ముందు జగన్ మాట్లాడిన కొన్ని వీడియోలను చూడాలని ఎద్దేవా చేశారు. ముందుగా జగన్​కు అ, ఆ లు నేర్పాలని సూచించారు. దమ్ముంటే సీఎం జగన్​తో మీడియా సమావేశం నిర్వహించాలని సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details