ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 7, 2020, 8:03 PM IST

ETV Bharat / city

ఇళ్ల పట్టాల పంపిణీని ఎందుకు అడ్డుకుంటున్నారు..?: జోగి రమేశ్

కోర్టులో పిటిషన్లు దాఖలు చేసి ఇళ్ల పట్టాల పంపిణీని తెదేపా అడ్డుకుందని వైకాపా నేత జోగి రమేశ్ ఆరోపించారు.

mla jogi ramesh fiers on chandrababu
mla jogi ramesh fiers on chandrababu

పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలని వైకాపా డిమాండ్ చేసింది. 30లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చే చారిత్రాత్మక కార్యక్రమం చేపడుతుంటే హైకోర్టులో నాలుగు పిటిషన్లు వేశారని... ఫలితంగానే ఇళ్ల పంపిణీని ఆపివేయాల్సి వచ్చిందని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగీ రమేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో శిఖండి పాత్ర పోషిస్తున్న వారు ఎప్పటికైనా ఓడిపోకతప్పదన్నారు.

ABOUT THE AUTHOR

...view details