ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా కార్యాలయం అక్రమ నిర్మాణమని సుప్రీంలో ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ - తెదేపా కార్యాలయం అక్రమ నిర్మాణమని సుప్రీంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్

గుంటూరు జిల్లా ఆత్మకూరులో తెదేపా కార్యాలయ నిర్మాణం జరిగిన భూకేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆత్మకూరు పరిధిలోని 3 ఎకరాల 65 సెంట్ల పోరంబోకు భూమి 99 ఏళ్ల పాటు కేటాయించారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ కేటాయింపులో సీఆర్​డీఏ చట్టాన్ని ఉల్లంఘించారని కోర్టుకు తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్​లో కోరారు.

MLA alla ramakrishna reddy files petition in Supreme Court alleging TDP office illegal construction
తెదేపా కార్యాలయం అక్రమ నిర్మాణమని సుప్రీంలో ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్

By

Published : Aug 28, 2020, 8:22 AM IST

తెదేపా కార్యాలయ నిర్మాణం కోసం గుంటూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన భూమి కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది అల్లంకి రమేష్ గురువారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు పరిధిలోని వాగు పోరంబోకునకు చెందిన 3 ఎకరాల 65 సెంట్ల భూమిని 99 ఏళ్ల పాటు లీజుకి కేటాయిస్తూ జూన్ 2017లో రాష్ట్ర ప్రభుత్వం జీవో 228 జారీ చేసింది.

సీఆర్​డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని, నీటివనరులతో సంబంధం ఉన్న భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేశారని ఆళ్ల పిటిషన్​లో పేర్కొన్నారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని.. అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్​లో ఆళ్ల రామకృష్ణారెడ్డి అభ్యర్థించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details