ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్​..​ ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ - ఆంధ్రప్రదేశ్ కరోనా న్యూస్

కరోనా వ్యాప్తి కట్టడిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ చేపట్టిన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, నేతలు తమ ప్రాంతాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

ministers,and leaders
రాష్ట్ర వ్యాప్తంగా 'లాక్ డౌన్​'ను​ పర్యవేక్షించిన ప్రజా ప్రతినిధులు

By

Published : Mar 29, 2020, 12:00 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా 'లాక్ డౌన్​'ను​ పర్యవేక్షించిన ప్రజా ప్రతినిధులు

రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ చేపట్టిన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.

నెల్లూరు జిల్లా...

నెల్లూరు నగరంలో ఏసీ కూరగాయల మార్కెట్ ను మూసేసి, కార్పొరేషన్ పరిధిలో 110 కూరగాయల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కరోనా నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అమలవుతున్న లాక్ డౌన్ ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు.

చిత్తూరు జిల్లా...

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. కరోనా వైరస్ నివారణకు ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉప ముఖ్య మంత్రి నారాయణస్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... కరోనా వైరస్ ప్రభావం పై జిల్లా అధికారులతో సమీక్షించారు.

శ్రీకాకుళం జిల్లా...

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ప్రభుత్వ సూచనలు ప్రజలు పాటించాలని కోరారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ప్రస్తుతం కోవిడ్-19కు మందు లేదని... వైరస్ వ్యాప్తిని నిరోధించటమే పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు.

కర్నూలు జిల్లా...

కర్నూలు జిల్లా బనగానపల్లెలో లాక్​డౌన్ కొనసాగుతోంది. ప్రజలు బయటకు రావద్దని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రధాన వీధుల్లో తిరిగి ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ తో కలిగే నష్టాలను ప్రజలకు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సమదూరం పాటించి మాస్కులు ధరించాలని అన్నారు. దినసరి మార్కెట్లలోకి కూరగాయల ధరలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలని... లేకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

విశాఖ జిల్లాలో...

కరోనా ప్రబలకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలో ఆయన పర్యటించారు. లాక్ డౌన్ అమలవుతున్న తీరును గమనించారు. ఎన్టీఆర్ మార్కెట్ లో కూరగాయల అమ్మకాలను పరిశీలించారు. వ్యాపారులకు, ప్రజలకు మాస్క్ లు పంపిణీ చేశారు.

పత్రికల్లో వచ్చిన వార్త అవాస్తవం...

తన సమీప బంధువుకు కరోనా సోకటంపై జరుగుతున్న ప్రచారాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఖండించారు. సుభాని అనే వ్యక్తి చనిపోయినట్లు కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. అలాగే తన బంధువు... దిల్లీ నుంచి వచ్చిన తర్వాత విందు ఇచ్చినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త పూర్తి అవాస్తవమని అన్నారు.

ఇవీ చూడండి:

'క్రమశిక్షణతో ఎదుర్కొందాం... లేకుంటే తప్పదు మూల్యం'

ABOUT THE AUTHOR

...view details