ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామోజీరావుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ మంత్రి తలసాని - updated news on Minister Talasani thanked Ramoji rao

కరోనా కట్టడి కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.20 కోట్ల ఆర్థిక సహాయం అందించిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్​ రామోజీరావుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కృతజ్ఞతలు తెలిపారు.

రామోజీరావుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ మంత్రి తలసాని
రామోజీరావుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ మంత్రి తలసాని

By

Published : Apr 2, 2020, 2:53 PM IST

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు ఇరు రాష్ట్రాలకు రూ.20 కోట్ల ఆర్థిక సహాయం చేసిన రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మెన్ రామోజీరావుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్​లోని ఆదర్శ నగర్​లో రేషన్ కార్డులు లేని పలువురు పేదలకు నిత్యావసర వస్తువులను మంత్రి పంపిణీ చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. చాలా మంది దాతలు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు సైతం తమ వంతు సాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. లాక్​డౌన్ నిబంధనలు పాటిస్తూ.. ప్రజలంతా సహకరించాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details