ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అవగాహన కల్పించకుండా లైసెన్స్​లు మంజూరు చేయవద్దు'

రహదారి భద్రతపై అవగాహన కల్పించకుండా డ్రైవింగ్ లెర్నర్ లైసెన్స్ మంజూరు చేయవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతా విషయాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని సూచించారు.

By

Published : Sep 8, 2020, 11:23 PM IST

minister perni nani
minister perni nani

రహదారి భద్రతపై అవగాహన కల్పించకుండా డ్రైవింగ్ లెర్నర్ లైసెన్స్ మంజూరు చేయవద్దని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్ తీసుకునే ముందే రోడ్డు భద్రతా విషయాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని సూచించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సేఫ్టీ ట్రైనింగ్ ఎడ్యూకేషన్ సెంటర్ ను మంత్రి పేర్నానాని... విజయవాడలోని ఆర్టీఏ కార్యాలయం నుంచి ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details